Friday, March 23, 2012

25తో ముగియనున్న రవితేజ ‘దరువు’


మాస్ మహారాజ రవితేజ తాజా నటిస్తున్న ‘దరువు’ చిత్రం షూటింగ్ ఈ నెల 25తో ముగియనుంది. ఏప్రిల్ నెలలో ఆడియో విడుదల చేసి...పోస్టు ప్రొడక్షన్ పనులు ముగిసన అనంతరం మే 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ ఆఫ్ సౌండ్ అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతున్న ఈ చిత్రంలో రవితేజ ఐదు షేడ్స్ విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. గతంలో విక్రమ హీరోగా వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో మూడు విభిన్నమైన పార్శ్వాల్లో కనిపిస్తాడు. అదే తరహాలో రవితేజ ఇందులో ఐదు పార్శ్వాల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లరి చిల్లర రౌడీ క్యారెక్టర్లతో కామెడీ హీరోగా కనిపించిన రవితేజ ఈ సినిమాలో తనలోని అసలైన నటుడిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ

No comments: